కట్టంగూర్, అక్టోబర్ 07 : నిత్య వ్యాయామంతో పాటు ప్రాణయామం, ధాన్యంతో మానసిక వత్తిడి తగ్గించుకోవచ్చని కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ అన్నారు. మంగళవారం పోలీసు స్టేషన్లో లయన్స్ క్లబ్ అఫ్ కట్టంగూర్ కింగ్స్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ ఆన్ స్ట్రెస్ ఫ్రీ వర్కింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పనులను ప్రణాళికయుతంగా చేస్తే ఒత్తిడిని తగ్గించుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరికి సమయానికి ఆహారంతో పాటు సరిపడా విశ్రాంతి ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ నాయిని శ్రీనివాస్, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షుడు రెడ్డిపల్లి సాగర్, కల్లూరి వెంకన్న, ప్రధాన కార్యదర్శి గుడిపాటి శివప్రసాద్, కోశాధికారి పోగుల రాములు గౌడ్, సభ్యులు మంగదుడ్ల శ్రీనివాస్, బొడ్డుపల్లి వెంకన్న, రాపోలు వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది మునాస సత్యనారాయణ, అనూష, శ్రీరాములు, అక్బర్ అలీ, రాంమోహన్, సుధాకర్ పాల్గొన్నారు.