బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఆదివారం కట్టంగూర్ మండలం కురుమర్తి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నల్లగొండ పట్టణానికి చెందిన పలువురు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు.
– కట్టంగూర్/నీలగిరి, అక్టోబర్ 8
కట్టంగూర్, అక్టోబర్ 8 : మాయమాటలు చెబుతూ వచ్చే మోసపూరిత కాంగ్రెస్కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. మండలంలోని కరుమర్తి గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 50 మంది నాయకులు, కార్యకర్తలు ఆదివారం నార్కట్పల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించి మాట్లాడుతూ.. ఇచ్చిన వాటితోపాటు ఇవ్వని హామీలను నెరవేర్చిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలువాలన్నారు.
రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నట్లు తెలిపారు. బూటకపు హామీలతో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకులు పగటికలలు కంటున్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేస్తున్న బీఆర్ఎస్ను మరోసారి ఆదరించి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్ ఊట్కూరి రామలింగయ్య, గంధమల్ల అంతయ్య, ఊట్కూరి నర్సింహ, దార చినరాములు, గంధమల్ల రవి, కాశమల్ల కాశయ్య, ఇంద్రకంటి సైదులు, కొంపెల్లి నరేశ్ ఉన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం సైదులు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కుందారపు వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పొడిచేటి సైదులు పాల్గొన్నారు.