దేవరకొండ : మన ఊరు-మన బడి కార్యక్రమం ఎంతో గొప్పదని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు,దేవరకొండ శాసన సభ్యుడు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. నల్లగొండ జిల్లా డిండి మండలం ఎర్రరాం గ్రామంలోని పాఠశాలలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా 24.58 లక్షలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. మన ఊరు-మన బడితో ప్రభుత్వ బడుల రూపురేఖలు మారతాయన్నారు. ఆయన వెంట డిండి మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.