త్రిపురారం, ఏప్రిల్ 13 : రోడ్డుపై ధాన్యం ఆరబోయగా ఆ రహదారిపై వెళ్తున్న బైక్ ఒక్కసారిగా స్కిడ్ కావడంతో వ్యక్తి కిందపడి తీవ్రగాయాలు కావడంతో మరణించాడు. ఈ విషాధ సంఘటన నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరు గ్రామ పంచాయతీ పరిధిలో నిన్న సాయంత్రం జరిగింది. అడవిదేవులపల్లికి చెందిన భద్రయ్య అనే వ్యక్తి బైక్పై మిర్యాలగూడకు వెళ్తున్నాడు. మాటూరు గ్రామ పంచాయతీ పరిధిలోని రహదారిపై ధాన్యం ఆరబోయగా బైక్ ఒక్కసారిగా స్కిడ్ కావడంతో భద్రయ్య కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికిత్స కోసం మిర్యాలగూడలోని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. రోడ్లపై ధాన్యం ఆరబోయకుండా నిరోధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.