రామగిరి, సెప్టెంబర్ 21 : తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణను గత ఆరు సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తూ ఫలితాలను విడుదల చేస్తున్న మహత్మా గాంధీ యూనివర్సిటీ సేవలు హర్షనీయమని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈవెంట్స్ను బుధవారం ఎంజీయూలో ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ సీహెచ్.గోపాల్ రెడ్డి రిజిస్టర్ ప్రొఫెసర్ కృష్ణారావు, సెట్ కన్వీనర్ సత్యనారాయణలతో కలిసి ప్రొఫెసర్ లింబాద్రి జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం స్వయంగా రన్నింగ్ చేసి విద్యార్థులను ప్రోత్సహించారు. మానసిక ప్రశాంతతతో ఫిజికల్ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంజీయూ ఓఎస్డీ డాక్టర్ అల్వాల్ రవి, స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి డాక్టర్ జి ఉపేందర్ రెడ్డి, ఎంయూ ఫిజికల్ డైరెక్టర్లు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్.మురళి ఎంజీయూ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.