2023-25 సంవత్సరాలకు సంబంధించి మద్యం దుకాణాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా ఎక్సైజ్ శాఖ టెండర్లు నిర్వహించేందుకు సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆధ్వర్యంలో రిజర్వేషన్ల కోసం లక్కీ డ్రా తీశారు. జిల్లాలో మొత్తం 155 మద్యం దుకాణాలకుగానూ గౌడ్లకుకు 15శాతం (34దుకాణాలు), ఎస్సీలకు 10 శాతం(14), ఎస్టీలకు 5 శాతం(4) కేటాయించారు. మిగిలిన 103 దుకాణాలను ఓపెన్ కేటగిరీలో పెట్టారు.వీటి టెండర్లకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేయనుండగా ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 21న డ్రా తీసి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
– నల్లగొండ, ఆగస్టు 3
నల్లగొండ, ఆగస్టు 3 : 2023-25 సంవత్సరాలకు సంబంధించి మ ద్యం దుకాణాల నిర్వహణకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆధ్వర్యంలో రిజర్వేషన్ల కోసం గురువారం లక్కీ డ్రా తీశారు. 2021-23 సంవత్సరానికి సంబంధించిన మద్యం దుకాణాల నవంబర్-30తో పూర్తి కానుండడంతో ప్రభుత్వం మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించ తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో గౌడ్స్, ఎస్సీ, ఎస్టీలకు ఉన్న రిజర్వేషన్ ఆధారంగా లక్కీ డ్రా తీశారు. జిల్లాలో మొత్తం 155 ఏ (4) మద్యం దుకాణాలకు ఈ టెండర్లు నిర్వహించగా వాటిలో గౌడ్స్కు 15శాతం (34దుకాణాలు), ఎస్సీలకు పది శాతం(14), ఎస్టీలకు ఐదు శాతం(4) కేటాయించారు. ఆ రిజర్వేషన్ ప్రకారం కలెక్టర్ ఆర్వీ కర్ణన్ డ్రా తీసి 52 దుకాణాలకు రిజర్వేషన్లు కేటాయించారు. మిగిలిన 103 దుకాణాలను ఓపెన్ కేటగిరీలో పెట్టారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సూపరింటెండెంట్ సం తోష్, ఎస్సీ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, బీసీ సంక్షేమ అధికారి ఖాజా నాజీమ్ అలీ, గిరిజన అభివృద్ధ్ది అధికారి రాజ్ కుమార్ పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లాలో 155 మద్యం దుకాణాలు ఉండగా శుక్రవారం నోటిఫికేషన్ విడుదల కానున్నది. అయితే శుక్రవారం నుంచి ఈ నెల 18 వరకు ఆశావహుల నుంచి రిజర్వేషన్లు, ఓపెన్ కేటగిరీలో దుకాణలకు సంబంధించి సాయంత్రం ఆరు గంటల వరకు జిల్లా కేంద్రంలోని ఎ క్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆ తర్వాత స్క్రూట్నీ చేసి ఈ నెల 21న డ్రా తీయనున్నారు. డ్రా ద్వారా ఎంపికైన వారు 21, 22వ తేదీల్లో లైసెన్స్ ఫీజులోని మొదటి దశ డబ్బులు చెల్లించాల్సి ఉండగా వారికి ఈ నవంబర్ 30న మద్యం సరఫరా చేస్తారు. ఆ తర్వాత అక్టోబర్ 1 నుంచి వారే ఆయా దుకాణాల్లో మద్యం విక్రయం చేసుకునే అవకాశం ఉంటుంది.
ఈ ఏడాది సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహిస్తున్నది. దాంతో పాటు దరఖాస్తు రుసుం కూడ రూ.2లక్షలు మాత్రమే ఉంచగా లైసెన్స్ ఫీజు కూడా గత పద్ధ్దతినే అనుసరిస్తున్నది. ఏడాదికి ఆరు విడుతల్లో మద్యం లైసెన్స్ ఫీజు చె ల్లించాల్సి ఉండగా 5వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు ఫీజు రూ.50లక్షలు, 50వేల వరకు రూ. 55లక్షలు, లక్ష జనాభా వరకు రూ. 60 లక్షలు, 5లక్షల జనాభా వరకు రూ.65లక్షలు నిర్ణయించారు. జి ల్లాలో ఐదు లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాలే ఉన్నందున అంతకు మించిన లైసెన్స్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.