ఆత్మకూర్.ఎస్, సెప్టెంబర్ 14: స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్.ఎస్ మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. నెమ్మికల్లో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం అనంతరం మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పలువురు నాయకులు, కార్యకర్తలకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని, బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకునేలా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని, యూరియా కొరతతో నానా ఇబ్బందులు పడుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూ స్థాపితం చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ జడ్పీ వైస్ చైర్మన గోపగాని వెంకటనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు తూడి నర్సింహారావు, సింగిల్ విండో చైర్మన్ కొణతం సత్యనారాయణరెడ్డి, వైస్ చైర్మన్ బొల్లె జానయ్య, జిల్లా నాయకులు మర్ల చంద్రారెడి మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ ముద్దం కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి బత్తుల ప్రసాద్, బ్రహ్మంగౌడ్, మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.