– కట్టంగూర్ ఎంపీడీఓ జ్ఞాన ప్రకాష్ రావు, సర్పంచ్ శ్యామల
కట్టంగూర్, మార్చి 25 : గ్రంథాలయాలు జ్ఞానానికి నిలయాలని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు, సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం కట్టంగూర్ శాఖ గ్రంథాలయంలో పుస్తక పఠనం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. పుస్తక పఠనం మనిషి ఆలోచన విధానాన్ని మార్చి, వ్యక్తిత్వ వికాసానికి దోహద పడుతుందన్నారు. యువత, విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని, రోజువారీగా పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. సమాజ అభివృద్ధికి చదువు ఎంతో అవసరమని, అందుకోసం ప్రతి ఒక్కరూ గ్రంథాలయ సభ్యత్వం పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అంబటి అంజయ్య, ఉప సర్పంచ్ గుండు రాంబాబు, పంచాయతీ కార్యదర్శి వడ్లకొండ అశోక్ గౌడ్, వార్డు సభ్యులు ఏనుగు సైదులు, కానుగు శీను, పులకరం శీను, కానుగు సైదమ్మ, గ్రంథ పాలకురాలు తారకేశ్వరి పాల్గొన్నారు.