యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను గెలిపిస్తాయని, వచ్చే ఎన్నికల్లో మూడోసారి అధికారంలోకి రావడం పక్కా అని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నారు. ఆలేరు, భువనరిగిలో ముచ్చటగా మూడోసారి గెలుబోతున్నారని తెలిపారు. ఆలేరులో 50వేల భారీ మెజార్టీతో గొంగిడి సునీతామహేందర్ రెడ్డి విజయం సాధిస్తారని చెప్పారు. భువనగిరి పట్టణంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో ఈ నెల 29న సీఎం కేసీఆర్ సభ కోసం ఏర్పాట్లు ప్రారంభించామని, లక్ష మందితో సూపర్ సక్సెస్ చేసేందుకు ప్రణాళిక
ఆలేరు, అక్టోబర్ 18 : ఆలేరు నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నారని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆలేరులో పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలోనే నియోజకవర్గంలో వేల కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని, కాంగ్రెస్ నాయకులకు ఓటు హకు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ఆలేరు ప్రజలకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఐదు సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ఏ ఒక రూపాయి పనిచేయని చేతకాని దద్దమ్మ అని విమర్శించారు.
కాంగ్రెస్ నాయకుల దొంగ మాటలని నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ఆలేరు పట్టణంలో రూ.15కోట్లతో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ మారెట్, మోడ్రన్ దోభీఘాట్ పనులకు శంకుస్థాపన చేసుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతను మరొకసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పర్ శంకరయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ మొరిగాడి మాధవీవెంకటేశ్, కౌన్సిలర్లు రాయపురం నర్సింహులు, కందుల శ్రీకాంత్, బేతి రాములు, జూకంటి శ్రీకాంత్, మారెట్ కమిటీ వైస్ చైర్మన్ పోరెడ్డి శ్రీనివాస్, పట్టణాధ్యక్షుడు పుట్ట మల్లేశ్గౌడ్, మారెట్ కమిటీ డైరెక్టర్లు పత్తి వెంకటేశ్, సంపత్, పాసికంటి శ్రీనివాస్, పీఏసీస్ఎస్ చైర్మన్ మొగులగారి మల్లేశ్, వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళ, మురారి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆడెపు బాలస్వామి, జంపాల దశరథ, జూకంటి ఉప్పలయ్య, పంతం కృష్ణ, రామకృష్ణ, మొరిగాడి ఇంద్ర, సీసా మహేశ్వరి పాల్గొన్నారు.