రామన్నపేట, మార్చి19 : బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతానికి కృషి చేద్దామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం రామన్నపేట మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. అనంతరం పట్టణ కేంద్రంలోని ఎంప్లాయీస్ కాలనీలో తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 21న మండల కేంద్రంలోని జేపీ గార్డెన్స్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశానికి మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని కార్యకర్తలు ప్రతి గడపకూ వెళ్లి వివరించాలన్నారు. సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరూ ఆత్మీయ సమ్మేళనానికి హాజరై విజయవంతం చేయాలన్నారు. మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పోషబోయిన మల్లేశం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, జడ్పీటీసీ పున్న లక్ష్మీజగన్మోహన్, సింగిల్విండో చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు ముక్కాముల దుర్గయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ బొక్క మాధవరెడ్డి, సర్పంచులు గుత్తా నర్సింహారెడ్డి, అప్పం లక్ష్మీనర్సు, పిట్ట కృష్ణారెడ్డి, మెట్టు మహేందర్రెడ్డి, ముత్యాల సుజాతారవి, కోళ్ల స్వామి, ఎంపీటీసీలు గొరిగె నర్సింహ, వేమవరపు సుధీర్బాబు, గాదె పారిజాత, నాయకులు నీల దయాకర్, బొక్క పురుషోత్తంరెడ్డి, పోతరాజు సాయికుమార్, రామిని రమేశ్, జాడ సంతోష్, మిర్జా ఇనాయత్బేగ్ పాల్గొన్నారు.