తిరుమలగిరి/నూతన్కల్, డిసెంబర్ 5 : చాపకింద నీరులా కుష్టు వ్యాధి విస్తరిస్తున్నది. ఏటా పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. అయితే వ్యాధి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న అవగాహన కార్యక్రమాలతో వ్యాధి కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా ప్రభుత్వం సర్వే చేపట్టనుంది. మంగళవారం నుంచి ఈనెల 21 వరకు ఇంటింటి సర్వే నిర్వహించి కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తించనుంది.
అంతేకాకుండా వారికి అవగా హన కార్యక్రమాలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. కాగా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గతంలో గుర్తించిన 78 మంది కుష్టు వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఇప్పటికే వైద్యం అందిస్తున్నది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్య సిబ్బందే ప్రజల వద్దకు(ఇంటింటికీ) వెళ్లి ఆరోగ్య సమాచారం తెలుసుకుంటున్నారు. ఉదయం 6 నుంచి 9.30 గంటల వరకు వైద్యసిబ్బంది, ఆశ కార్యకర్తలు సర్వే నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయి బృందం పర్యవేక్షిస్తుంది. సర్వే ఆధారంగా కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి వైద్యం సాయం అందించనుంది.
వ్యాధి నిర్ధారణ ఇలా ..
పాసీ బేసిలరీ లెప్రసీ (పి.బి)
మల్టీ బేసిలరీ లెప్రసీ (ఎం.బీ)
చికిత్స ఇలా..
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
కుష్టువ్యాధి సోకిన వారు మెత్తని చెప్పులు (మైక్రోసెల్లూలార్ రబ్బరు చెప్పులు ) విధిగా ధరించి స్పర్శలేని పాదాలను బొబ్బలు, పుండ్ల బారి నుంచి రక్షించుకోవాలి. ప్రతి రోజూ రోగి స్పర్శ కోల్పోయిన తన కాళ్లు చేతులతో బొబ్బలు, పుండ్లు గమనించుకోవాలి.
పొడారిన చేతులు, కాళ్లను ప్రతిరోజూ 30 నిమిషాలు నీటిలో నానబెట్టి, గట్టి చర్మాన్ని(పగుళ్లు లేక గాట్లున్న) మొద్దుగా ఉన్న అంచులు రాయితో తోమాలి. తర్వాత వంట నూనె పూయాలి.
వైద్య సిబ్బందికి సహకరించాలి
పక్షం రోజులు నిర్వహించే లెప్రసీ అవగాహన కార్యక్రమాన్ని (సర్వే)ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. లక్షణాలను ఎంతగా గుర్తిస్తే నివారణ అంత సులువవుతుంది. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తుంది. ఇంటికి వచ్చి సర్వే చేసే వైద్యసిబ్బందికి, ఆశ కార్యకర్తలకు సహకరించాలి. కుష్టు వ్యాధి నిర్మూలనే ధ్యేయంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రాష్ట్ర కమిటీ పర్యవేక్షణ ఉంటుంది.
– చంద్రశేఖర్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్, సూర్యాపేట