రామగిరి, డిసెంబర్ 23 : మాజీ ప్రధాని పీవీ.నర్సింహారావు వర్ధంతిని పురస్కరించుకుని నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన చిత్రపటానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో గుత్తా వెంకట్రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ అమిత్రెడ్డి, కనగల్ జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, బీఆర్ఎస్ నాయకులు దుబ్బా అశోక్, యామ దయాకర్, మందడి మధుసూదన్రెడ్డి, హరికృష్ణ, వెంకట్ పాల్గొన్నారు.