గుర్రంపోడు, జనవరి 27 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. మండలంలోని జూనూతుల గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 100 కుటుంబాలు శుక్రవారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నేరవేర్చడంతోపాటు, అన్ని వర్గాలకు లబ్ధిచేకూరేలా అనేక పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో మన లాంటి పథకాలు లేవన్నారు. అందుకే దేశం మొత్తం సీఎం కేసీఆర్ పాలననే కోరుకుంటున్నదని, ఆయన నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష అన్నారు. పార్టీలో చేరిన వారిలో సింగిల్విండో చైర్మన్ బొల్లెం సత్తమ్మ, బొల్లం నర్సింహ్మ, బొమ్ము నాగరాజు, మారపాక సెల్మాన్, రాజు, బొమ్ము సత్తయ్య, బొల్లం కృష్ణతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరీధనుంజయ్, బీఆర్ఎస్ మండలాధ్యక్ష, కార్యదర్శులు గజ్జెల చెన్నారెడ్డి, రామగిరి చంద్రశేఖర్రావు, ఏపీసీఎస్ చైర్మన్ ఆవుల వెంకన్న, గ్రామ శాఖ అధ్యక్షుడు భూయ్య గిరి, నాయకులు వాకిటి చక్రవర్తి, మారపాక వెంకటయ్య, కంచర్ల ఇంద్రారెడ్డి, చంద్రయ్య, బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు పిల్లి అభినయ్ యాదవ్, సర్పంచులు, ఎంపీటీసీ పాల్గొన్నారు. అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్రెడ్డి మాతృమూర్తి రాములమ్మ ఇటీవల మృతి చెందగా ఆమె చిత్రపటానికి శుక్రవారం ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.