నకిరేకల్, నవంబర్ 25 : రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని రాజ్యసభ సభ్యుడు బడుగులు లింగ య్యయాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ పట్టణంలో అత్యాధునిక సౌకర్యాలతో దాదాపు రూ. 32 కోట్లతో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి శుక్రవారం వారు భూమిపూజ చేసి మాట్లాడారు. న్నారు. సీఎం కేసీఆర్ను విమర్శించే హక్కు బీజేపీ నాయకులకు లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగవన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో టీఆర్ఎస్ మంత్రులు, పార్టీ నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నదని ఆరోపించారు. భవిష్యత్లో బీజే పీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలువా లని పిలుపునిచ్చారు.
మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, వైస్ చైర్మన్ ఉమారాణీకృష్ణమూర్తి, మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, కమిషనర్ ఎడం బాలాజీ, నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూర్ జెడ్పీటీసీలు ధనలక్ష్మీనగేశ్, స్వర్ణలత, బలరాం, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
పట్టణంలోని బైపాస్పై శుక్రవారం రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జేసీబీ నడిపి ప్రారంభించారు. అనంతరం పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీలో దాదాపు రూ. 22 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. సెంట్రల్ లైటింగ్ను 3 నెలల్లో పూర్తిచేయనున్నట్లు తెలిపారు. తిప్పర్తి రోడ్డు పనులకు రూ. 20లక్షలు మం జూరయ్యాయని, రాకపోకలకు ఇబ్బంది లేకుండా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు.
నార్కట్పల్లి, నవంబర్ 25 : పేదలకు కార్పొరేట్ వైద్యం అందిం చాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన సీఎం సహాయనిధి పథకం పేదలకు వరం లా మారిందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 50 మంది లబ్ధిదారులకు రూ. 16 లక్షల విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసి మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయన్నారు. ఎంపీపీ నరేందర్రెడ్డి, వివిధ గ్రామల సర్పంచ్లు, ఎంపీటీసీ పాల్గొన్నారు.