సూర్యాపేట టౌన్, నవంబర్ 1 : విషబుద్ధితో రాక్షస రాజకీయాలకు పాల్పడుతున్న విపక్ష పార్టీలు బీఆర్ఎస్ గెలుపును ఆపలేవని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తొమ్మిదిన్నరేండ్లుగా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న అభివృధ్ధి పాలనలో చిచ్చులు పెట్టే కుట్రలకు విపక్షాలు దిగజారుతున్నాయని, అలాంటి అరాచక శక్తులను పేట నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన సమక్షంలో పట్టణానికి చెందిన 9, 21వార్డులతో పాటు ఆత్మకూర్(ఎస్) మండలంలోని తుమ్మల పెన్పహడ్ గ్రామం, చివ్వెంల మండలంలోని ఐలాపురం గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ యువకులు, నాయకులు, మహిళలు, నూతన ఓటర్లు సుమారు 540మంది బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ సమై క్య పాలనలో అన్ని విధాలుగా ఆగమైన సూర్యాపేటను సీఎం కేసీఆర్ సారథ్యంలో జిల్లా కేంద్ర ంగా మార్చుకుని అన్ని రంగాలను అభివృద్ధి చేశామన్నారు. 2014 నుంచి నిరంతర విద్యుత్, పుష్కలంగా తాగు, సాగు నీరు, రైతుబంధు, బీమా, దళిత బంధు అమలుతో ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారన్నారు. 60ఏండ్లకు పైగా పాలించి అన్ని విధాలుగా ఆగం చేసిన ఆయా పార్టీలు అతి తక్కువ సమయంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి తట్టుకోలేకనే విషం కక్కుతున్నాయని విమర్శించారు. అభివృద్ధి నిరోధకులైన కాంగ్రేస్, బీజేపీ, చోటామోటా పార్టీలు కొత్తగా ఇప్పుడేదో చేస్తామంటే ప్రజలంతా నమ్మడం కాదు నవ్వుకుంటున్నారని తెలిపారు.
విపక్షాలకు తగిన బుద్ధి చెప్పాలనే సంకల్పంతోనే అన్ని రంగాల ప్రజలు ఆయా పార్టీలను వీడి బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. అభివృద్ధి నిరోధకుల పార్టీల్లో ఇక కొనసాగలేమని స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందని అంతా నమ్ముతున్నారన్నారు. పార్టీలో చేరిన వారిలో ఎరగాని ఉపేందర్గౌడ్, లింగయ్యగౌడ్, ఎల్లయ్య, లెనిన్, సందీప్, వరికుప్పల వెంకటేశ్, శ్రీకాంత్, వేణు, లింగరాజు, తిరుపయ్య ఉన్నా రు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారయణగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, పట్టణ, మండల అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, తూడి నర్సింహారావు, జూలకంటి జీవన్రెడ్డి, నాయకులు మర్ల చంద్రారెడ్డి, గుర్రం సత్యనారాయణ, బూర బాలసైదులు, రామగిరి నగేశ్, అబ్దుల్ రహీమ్ (పిల్లు), గొట్టేటి సైదులు, శేఖర్, రవి, వెంకటరమణ, లింగయ్య పాల్గొన్నారు.
నల్లగొండ : ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని 21, 42వ వార్డులకు చెందిన బీజేపీ కార్యకర్తలు సూర్యాపేటలో మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో బుధవారం బీఆర్ఎస్లో చేరారు. పొగాకు నాగరాజు, బొల్లం నరేశ్తో పాటు పలువురు బీఆర్ఎస్లో చేరగా వా రికి మంత్రి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పట్టణాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, రావుల శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.