దేవరకొండ, జనవరి 30 : వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాలయాపన చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. దేవరకొండలోని ఆయన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారన్నారు. రైతు రుణ మాఫీ, రైతు భరోసా పథకాలు అమలు చేయకుండా, అడిగిన వారిపై మంత్రి కోమటిరెడ్డి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని తెలిపారు. ఎన్నికలకు ముం దు 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ నేటికీ అమలు చేయలేదన్నారు. హామీల గురించి ప్రశ్నించిన జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై కోమటిరెడ్డి అహంకార పూరితంగా మాట్లాడడం తగదని హెచ్చరించారు.
సందీప్రెడ్డికి 60 లక్షల సభ్యత్వం కలిగిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అండగా ఉంటారని చెప్పారు. గత పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నాయకులకు కూడా ప్రొటోకాల్ పాటించినట్లు ఆయన తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంటనే జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డికి చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్రెడ్డి, హన్మంత్ వెంకటేశ్గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు ముక్కమాల బాలయ్య, వల్లపు రెడ్డి, తూం నాగార్జున్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు టీవీఎన్ రెడ్డి, దొంత చంద్రశేఖర్రెడ్డి, లోకసాని తిరుపతయ్య, రమావత్ దశ్రునాయక్, మల్లారెడ్డి, కేసాని లింగారెడ్డి, తరుపతయ్య, మోహన్, బోయపల్లి శ్రీనివాస్గౌడ్, గాజుల ఆంజనేయులు, గోపిడి కృష్ణారెడ్డి, అరెకంటి రాములు, గోసుల అనంతగిరి, జనార్దన్ రావు, శంకర్ నాయక్, లోక్యానాయక్, గాడుల రాజేశ్, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.