నీలగిరి, ఫిబ్రవరి 11 :మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండకు రావాలంటే ముక్కు నేలకు రాసి రావాలని అని వ్యాఖ్యలు చేయడం సరికాదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి మండిపడ్డారు. నల్లగొండలో ఈ నెల 13న నిర్వహించనున్న కేసీఆర్ బహిరంగ సభా స్థలాన్ని అదివారం వారు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కోమటిరెడ్డి మాయ మాటలు నమ్మి ఓట్లేసిన జనం ఆయనను చీదరించుకొనే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.
అవగాహన లేకుండా కేంద్రానికి కృష్ణా ప్రాజెక్టులను అప్పజెప్పి, ఇప్పుడ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయమై రైతులను జాగృత పరచడానికి నల్లగొండలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నామని, అడ్డంకులు సృష్టించడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తే తొకుకుంటూ వెళ్తామని హెచ్చరించారు. 20 ఏండ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా నల్లగొండను అభివృద్ధి చేయలేపోయిన కోమటిరెడ్డి ఏ మొఖం పెట్టుకొని కేసీఆర్ను విమర్శిస్తున్నావని ప్రశ్నించారు.
తెలంగాణ హకుల్ని ఇతరులకు తాకట్టు పెట్టిన విధానం, కాంగ్రెస్ చేసిన తప్పును ప్రజలకు జరుగబోయే ప్రమాదాన్ని అందరికీ చెప్పాలనే సభను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ కోసం, తెలంగాణ హకుల కోసం కొట్లాడేది కేసీఆర్ మాత్రమేనని మరోసారి నిరూపితమయ్యిందన్నారు. రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. వారి వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, సీనియర్ నాయకులు సింగం రామ్మోహన్, పట్టణ పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, కార్యదర్శి సంధినేని జనార్దన్ రావు, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు?