నార్కట్పల్లి జనవరి 21 : రాష్ట్రంలో అంధత్వ నివారణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం మండలంలోని కొండపాకగూడెంలో కంటి వెలుగు శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజలు ఉచిత కంటి పరీక్షలను సద్వినియోగం చేసుకొని కంటి అద్దాలు పొందాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్రెడ్డి, ఎంపీటీసీ రాజిరెడ్డి, వెంకట్రెడ్డి, నర్సింహాచారి పాల్గొన్నారు.
కంటి వెలుగును సద్వినియోగంచేసుకోవాలి : డీఎంహెచ్ఓ
చిట్యాల : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్ఓ కొండల్రావు అన్నారు. చిట్యాలలో కంటి వెలుగు శిబిరాన్ని శనివారం ఆయన సందర్శించి పరిశీలించారు. వైద్య సిబ్బందిని శిబిరం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి కిరణ్కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ లింగస్వామి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.