నల్లగొండ : పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మంగళవారంమహిళా దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని మహిళా అధికారులు, ప్రజాప్రతినిధులను ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఘనంగా సన్మానించారు. అనంతరం కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహిళా సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు భారం కావొద్దని సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.