నల్లగొండ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా తిప్పర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 50 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎంపీ లింగయ్య యాదవ్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారన్నారు.
పార్టీలో చేరిన వారందరికి సరైన గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, డీసీపీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రొట్టెల రమేష్, టీఆర్ఎస్ నేత కందుల లక్ష్మయ్య, మాజీ సర్పంచ్ జాకటి మోష, గుండెబోయిన రామచంద్రు, గుండెబోయిన సైదులు,నాగరాజు పాల్గొన్నారు.