నల్లగొండ : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం నకిరేకల్ మున్సిపాలిటీ 5, 6వ వార్డు నుంచి 80 మంది మహిళలు వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు. దేశంలో ఎక్కడా అమలు చేయని సంక్షేమ పథకాలను రాష్టంలో అమలు చేస్తూ సబ్బండ వర్గాలకు లబ్ది చేకూరుస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని పేర్కొన్నారు. పాత, కొత్త తేడా లేకుండా కార్యకర్తలు కలసికట్టుగా పనిచేసి మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలన్నారు.
పార్టీలో చేరిన వారిలో మాతంగి రజిత, గాదె సుశీల, నకిరేకంటి ప్రసన్న, సునీత, బోస్క రేణుక, తీగల లలిత, వంటపాక వెంకటమ్మ, జిల్లా ప్రమీల, వంటపాక మారెమ్మ, గాదె వెంకటేష్, వంటేపాక పుష్ప, రేణుక, ఎల్లమ్మ, మండలం పద్మ, గూడపురి సైదమ్మ తదితరులు ఉన్నారు.