పాలకవీడు: మండలంలోని జాన్పహాడ్ దర్గాలో హుజుర్నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ఆదివారం ప్రత్యేక ప్రార్ధ నలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా ముజావర్ జానీ ఆయనకు దర్గా సాంప్రదాయ స్వాగతం పలికారు. పూజా సామాగ్రి, గంధం కలశంతో ఎమ్మెల్యే సైదులు బాబా సమాధుల వద్ద ప్రదక్షణలు నిర్వహించారు. అనంతరం సమాధుల మీద ప్రత్యేక ఛాదర్లను, పూలమాలలను సమర్పించారు. అనంతరం ముజావర్ జానీ ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ జాన్పహాడ్ దర్గా హిందూ,ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నదని, దర్గా అభివృధ్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో హుజుర్నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, నేరేడుచర్ల మున్సిపల్ వైస్చైర్మన్ చల్లా శ్రీలతారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మలమంటి దర్గారావు, పాలకవీడు పీఎస్సీఎస్ చైర్మన్ యరెడ్ల సత్యనారాయణరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కిష్టపాటి అంజిరెడ్డి, నాయకులు, చిత్తలూరి సైదులు, సురేశ్, వెంకటరెడ్డి, అశోక్నాయక్, మార్కండేయ, తదితరులు పాల్గొన్నారు.