కట్టంగూర్, జూన్ 21 : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గోదావరిపై 963 టీఎంసీల ప్రాజెక్టులకు రూపకల్పన జరిగిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం కట్టంగూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో 946 టీఎంసీలకు సీడబ్ల్యూసీ హైడ్రాలజీ క్లియరెన్స్ ఇవ్వడంతో పాటు వార్థా, తుమ్మిడిహట్టికి 20 టీఎంసీలు ఇచ్చేందుకు సూత్రపాయంగా అనుమతి ఇచ్చేందుకు ఒప్పుకుందన్నారు. గోదావరిలో 1000, కృష్ణాలో 500 టీఎంసీలు ఇచ్చి ఏపీ ఎన్ని టీఎంసీలైన దొచుకుపోవచ్చని ఎట్లా మాట్లాడుతావని సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి బ్యాగులు గురించి తప్పా బేసిక్స్, బేసిన్స్ గురించి తెలువదన్నారు. దేవాదుల, బనకచర్ల ఎక్కడుందో తెలవని మూర్ఖుడని, బూతులు వాగినట్లు కాదని, నీళ్ల గురించి మాట్లాడాలన్నారు.
దేవాదుల ఏ బేసిన్లో ఉందని అధికారులను అడగడంతో పాటు నల్లమల్ల తెలంగాణకే చెందుతదా అనడం బాధ్యత, అవగాహన లేని వ్యక్తి సీఎంగా ఉండడం దౌర్భాగ్యం అన్నారు. ఏపీ ప్రభుత్వం బనకచర్లను ఆరు నెలల నుంచి కడుతూ కేంద్ర ఆర్థిక, జలశక్తి మంత్రులకు ఉత్తరాలు రాస్తూ వారిని కలుస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఏం చేస్తున్నరని ప్రశ్నించారు. అవగాహన లేని మాటలు మాట్లాడుతూ రేవంత్రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజల పరువు తీస్తుండని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, మాజీ వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, నకిరేకల్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ్మ, నాయకులు రెడ్డిపల్లి మనోహర్, నోముల వెంకటేశ్వర్లు, శ్రీరాద రామకృష్ణ, పోగుల అంజయ్య, యర్కల మల్లేశ్, పోగుల నర్సింహ్మ, యర్కల శ్రీను, జిల్లా యాదయ్య పాల్గొన్నారు.