స్వరాష్ట్రంలో కుల వృత్తులకు పూర్వ వైభవం వచ్చింది. ఉమ్మడి పాలనలో నిరాదరణకు గురైన బీసీ కుల వృత్తులకు రాష్ట్ర సరారు పునరుజ్జీవం పోసింది. దేశంలో ఎకడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఆదర్శంగా నిలిచింది. తాజాగా దేశమే అబ్బురపడేలా కొత్త పథకాన్ని తీసుకొస్తున్నది. బీసీ వృత్తిదారులకు లక్ష రూపాయలు అందించే పథకాన్ని ప్రకటించింది. ఆర్థికంగా నిలదొకుకునేందుకు సరారు సాయం అందించనున్నది. ఇందుకు సంబంధించి సబ్ కమిటీని కూడా నియమించింది. త్వరలోనే విధివిధానాలు ఖరారు కానున్నాయి. సర్కారు నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో వేల మంది వృత్తిదారులకు లబ్ధి చేకూరనున్నది. పథకం ప్రకటనపై బీసీ సంఘాలు, వృత్తిదారుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గౌడ, నేత, గొల్లకుర్మలు, ముదిరాజ్ తదితర వర్గాలకు పలు సంక్షేమ పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్నది.
– యాదాద్రి భువనగిరి, మే 19 (నమస్తే తెలంగాణ)
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కుల వృత్తులకు ఆదెరువు లభిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎకడా లేని విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది. నాయీబ్రాహ్మణుల హెయిర్ సెలూన్లకు ఉచిత విద్యుత్ వచ్చింది. రజకులకు ధోబీఘాట్లు, బట్టలుతికే మిషన్లు అందినయ్. కుమ్మరులకు ఆధునిక పాటరీ యంత్రాలు దొరికినయ్.. సబ్సిడీ వచ్చింది. నేతన్నలకు పొదుపు పథకం, బీమా, సబ్సిడీలు అందుతున్నాయి. గౌడన్నలకు గీతన్న బీమా, గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ, ముదిరాజ్లకు ఉచిత చేప పిల్లల పంపిణీ.. ఇలా అనేక పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్నది. తాజాగా బీసీ కుల వృత్తులకు లక్ష ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. త్వరలోనే విధివిధానాలను ఖరారు చేసి.. పథకాన్ని ప్రారంభించనున్నది. సర్కారు నిర్ణయంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల మంది వృత్తిదారులు లబ్ధి పొందనున్నారు.
– యాదాద్రి భువనగిరి, మే 19 (నమస్తే తెలంగాణ)
గీత కార్మికులకు బీమా.. రిజర్వేషన్లు
రాష్ట్ర ప్రభుత్వం గౌడన్నలకు ఇటీవల రైతు బీమా మాదిరి ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రకటించింది. ఇప్పటికే చెట్లకు పన్ను వసూలు చేసే విధానానికి స్వస్తి పలికిన సర్కారు.. రూ.7.98 కోట్ల బకాయిలను రద్దు చేసింది. గీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే పరిహారం కింద రూ.5లక్షలు ఇస్తున్నది. గతంలో శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ.50 వేలు మాత్రమే పరిహారం లభించేది. తెలంగాణ ప్రభుత్వం రూ.5లక్షలకు పెంచింది. మద్యం దుకాణాల కేటాయింపుల్లో గౌడన్నలకు 15 శాతం రిజర్వేషన్ కల్పించింది.
మోడ్రన్ ధోబీఘాట్లు
రజక వృత్తిదారులకు ప్రభుత్వం మోడ్రన్ ధోబీఘాట్లను నిర్మిస్తున్నది. మొదట్లో ఒకో ధోబీఘాట్ను రూ.37లక్షలతో నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ తర్వాత రూ.52లక్షలకు పెంచింది. ఇందులో రూ.17లక్షలు మిషనరీ (ఉతికేందుకు, పిండేందుకు, ఆరబెట్టేందుకు అత్యాధునిక యంత్రాలు) కి కేటాయించగా, మిగిలిన మొత్తాన్ని సివిల్ వర్స్ (విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, బోరు, మోటర్, శానిటేషన్, సిమెంట్ బెడ్, ఎలక్ట్రికల్, కాంపౌండ్ వాల్)కు కేటాయిస్తున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాకు 19 మోడ్రన్ ధోబీఘాట్లు మంజూరయ్యాయి.
ముదిరాజ్ లు మురిసేలా..
ముదిరాజ్లు, బెస్తల అభ్యున్నతికి ప్రభుత్వం ఏటా చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్నది. జిల్లాలో ప్రతి సంవత్సరం సుమారు రూ.3కోట్లతో 3.5కోట్ల చేప పిల్లలను 900 చెరువుల్లో వదులుతున్నది. అంతేకాకుండా75శాతం సబ్సిడీపై ట్రాన్స్పోర్టు వాహనాలు, ద్విచక్ర వాహనాలు, లగేజీ ఆటోలను పంపిణీ చేసింది. అదేవిధంగా ఫిష్ ఔట్లెట్లు ఇచ్చింది.
రజక, నాయీ బ్రాహ్మణులకు ఉచిత కరంట్ ..
రాష్ట్ర ప్రభుత్వం నాయీబ్రాహ్మణుల సెలూన్లు, రజకుల లాండ్రీ షాపులకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నది. దీనికి అయ్యే ఖర్చును మొత్తం సరారే భరిస్తున్నది. ఈ పథకం కింద ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 11,635 మంది రజకులు, 3,350 మంది నాయీబ్రాహ్మణులకు ఉచితంగా విద్యుత్ అందుతున్నది. ఇక నాయీబ్రాహ్మణులు, రజకుల సౌకర్యార్థం మున్సిపల్, ట్రేడ్ లైసెన్స్ల నిబంధనను మినహాయించింది. దీంతో ఆయా కులాలవారీగా ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతున్నది.
నేత కార్మికులకు అనేక పథకాలు..
స్వరాష్ట్రంలో ప్రభుత్వం ఆసరా కావడంతో నేతన్నల బతుకులు మారాయి. వారి కోసం పొదుపు పథకం తీసుకురాగా.. 11,218 మంది నేత కార్మికులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. నూలు, రసాయనాలపై సబ్సిడీ అందిస్తున్నది. నేత కార్మికులకు పింఛన్లు ఇస్తున్నది. పవర్లూమ్స్కు సంబంధించి 50శాతం విద్యుత్ రాయితీ ఇస్తున్నది. నేతన్నలకు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏ కారణాలతో చనిపోయినా కుటుంబ సభ్యులకు రూ.5లక్షలు అందించి ఆదుకుంటున్నది. ఈ పథకం కింద జిల్లాలో 18 మంది వారం, పది రోజుల్లోనే 5 లక్షల రూపాయల సాయం పొందారు.
గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ
గొల్ల కురుమల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2017లో గొర్రెల సబ్సిడీ పథకానికి శ్రీకారం చుట్ట్టింది. ఈ పథకం కింద సరారు 75శాతం సబ్సిడీ అందిస్తున్నది. ఒకో యూనిట్కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందిస్తుండగా.. యూనిట్ ఖర్చు రూ.1.25లక్షలుగా నిర్ణయించారు. అయితే.. గొర్రెల ధరలు పెరుగడంతో రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ ఖర్చును పెంచింది. ఇప్పటి వరకు ఉన్న రూ.1.25లక్షల యూనిట్ ఖర్చును రూ.1.75లక్షలకు పెంచింది. మొత్తం యూనిట్ ఖర్చులో లబ్ధిదారుడు రూ.43,250 చెల్లించాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుతం 1,31,750 రూపాయలు చెల్లిస్తున్నది. ఇప్పటికే మొదటి విడుత గొర్రెల పంపిణీ పూర్తి కాగా, రెండో విడుత పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ దఫా సుమారు 17వేల మందికి గొర్రెల యూనిట్లు ఇవ్వనున్నారు.
వృత్తిదారులను ఆదుకున్నది సీఎం కేసీఆరే
వృత్తిదారులు ఆర్థికంగా చితికిపోయి వృత్తులు కనుమరుగవుతున్న వేళ అండగా నిలిచి పునరుజ్జీవం పోసింది ముఖ్యమంత్రి కేసీఆరే. గతంలో కుల వృత్తులకు సరైన ఆదరణ లేక, పనుల్లేక జీవనం కష్టమైంది. మాలాంటి వారి బాధలను గుర్తించిన సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలిచారు. హెయిర్ సెలూన్ దుకాణాలకు కరెంట్ను ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పుడు కుల వృత్తులకు రూ.లక్ష ఆర్థిక సహాయం ప్రకటించడంతో నా లాంటి వారికి ప్రాణం లేచొచ్చినట్లయింది. గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. కేసీఆర్ మేలును ఎప్పటికీ మరిచిపోము.
– దేవులపల్లి శ్రీను, నాయీబ్రాహ్మణుడు, గరిడేపల్లి
సీఎం కేసీఆర్తోనే అన్ని కులాలకు సమన్యాయం
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం దక్కుతుంది. పేద, మధ్య తరగతి కులాల వారికి అవసరమైన సంక్షేమ పథకాలు అందిస్తూ వారికి ఆర్థికంగా సహాయపడుతున్నారు. యాదవులకు గొర్రెల యూనిట్లతోపాటు కుల వృత్తులను నమ్ముకొని జీవిస్తున్న కుమ్మరులు, ముదిరాజ్లు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఆర్థికంగా చేయూతనివ్వడం సీఎం కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనం.
– అల్లి వెంకన్నయాదవ్, యాదవ అధ్యక్షుడు, కొండకిందిగూడెం, కేతేపల్లి మండలం
వృత్తులకు పునరుజ్జీవం పోసిన మహానుభావుడు
గత ప్రభుత్వాలు వృత్తిదారులను పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలో అందరి అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పేదల పెన్నిధిగా నిలుస్తున్నారు. వృత్తినే నమ్ముకుని జీవనం సాగించే మాలాంటి వారికి తిరిగి పునరుజ్జీవం పోసిన మహానుభావుడు. వృత్తిదారుల ఆర్థిక స్థితిగతులను బాగు చేసేందుకు రూ.లక్ష ఆర్థిక సహాయం ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. మా తాత, తల్లిదండ్రుల కాలం నుంచి కుల వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాం. ఆర్థిక వెనుకబాటుతో చెట్టు కిందనే కటింగ్ చేస్తున్నా. ప్రభుత్వ సాయం అందితే సెలూన్ షాపు ఏర్పాటు చేసుకుంటా.
– మహేశ్వరం జానయ్య, నాయీబ్రాహ్మణుడు, కనగల్
మా జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు సీఎం కేసీఆర్
కుల వృత్తిదారుల కుటుంబానికి రూ.లక్ష ఇస్తామని ప్రభుత్వం చెప్పడం చాలా ఆనందంగా ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా వృత్తిదారులకు సహాయం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మా పాలిట దేవుడు. లక్ష రూపాయల్లో రూ.50వేలు మాఫీ చేసి రూ.50వేలు కట్టాలన్నా అందుకు సిద్ధంగా ఉన్నాం. గతంలో మత్స్యకారులకు టీవీఎస్లు, టాటా ఏస్లు సబ్సిడీపై అందించారు. ఇప్పుడు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామనడం హర్షణీయం. మత్స్యకారుల సంఘాల్లోని కుటుంబాలకు ప్రభుత్వం నేరుగా ఈ సాయం అందించాలి. జీవితాంతం సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– కటికర్ల ఎల్లయ్య, మంగమ్మ దంపతులు (మత్స్యకార్మికులు, తిరుమలగిరి సాగర్)
సబ్బండ వర్గాల సంక్షేమానికి సర్కారు కృషి
కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగించే వారిని గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నది. దేశంలో ఎక్కడా లేని పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే. కుల వృత్తులపై ఆధాపడి జీవనం సాగించే వారికి చేయూత అందిస్తామని రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. వృత్తిదారులకు భరోసా నింపిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– పుల్లంగారి సిద్ధ్దయ్య, రజక సంఘం నాయకుడు, రాజాపేట
గీత వృత్తికి వెన్నుదన్నులా సర్కారు సహాయంకుల
వృత్తులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ రూ.లక్ష సహాయం అందిస్తామని ప్రకటించడం గొప్ప విషయం. కత్తి మీద సాములా ఉండే మా గీత వృత్తికి ఈ సహాయం వెన్నుదన్నులా ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఆదుకోని విధంగా తెలంగాణలో కుల వృత్తులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. సర్కారు అందించే సహాయంతో తాము ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకొని ఆర్థికంగా ఎదుగుతాం. కుల వృత్తులను ఆదుకునేందుకు రూ.లక్ష సహాయం ప్రకటించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– బొమ్మగాని సైదులుగౌడ్, గీత కార్మికుడు, మొల్కపట్నం, వేములపల్లి మండలం
మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి
కావాలికుల వృత్తులను ఆర్థికంగా ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో మా కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది. లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించడం మాకెంతో ఆనందాన్ని నింపింది. ఆ డబ్బుతో చెరువులో చేపలు పట్టుకునేందుకు అవసరమైన వలలు, తెప్పలను కొనుగోలు చేసుకొని వాటితో జీవనోపాధి వెళ్లదీసుకోవచ్చు. సర్కారు సహాయంతో మా బతుకులు మారుతాయి. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి.
– గంధశిరి రామ్మూర్తి, మత్స్యకార్మికుడు, తిర్మలరాయినిగూడెం, శాలిగౌరారం మండలం
సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల వారు లబ్ధి పొందుతున్నారు. ఇదివరకు ముదిరాజ్లకు అనేక పథకాలు అమలు చేశారు. మిషన్ కాకతీయ కింద చెరువుల పూడిక తీయడం, ఉచితంగా చేప పిల్లలు అందించడం, చేపలు పట్టుకునేందుకు వలలు, మోటార్ సైకిళ్లు అందించడం మాకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఇప్పుడు కుల వృత్తులు చేసుకునే వారికి లక్ష రూపాయల సహాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయం. కుల వృత్తులకు సహాయం చేస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు.
– కేశబోయిన సైదాహుస్సేన్, మత్స్యకారుడు, అడవిదేవులపల్లి
కుల వృత్తులకు చేయూత సంతోషకరం
ప్రభుత్వం కుల వృత్తులకు లక్ష రూపాయల చేయూత కార్యక్రమం ప్రవేశపెట్టబోతుండటం చాలా సంతోషకరం. వృత్తిదారులందరూ వెనుకబడి ఉన్నారు. ముఖ్యంగా గౌడ కులస్తులకు ఇంతవరకు వ్యక్తిగత లాభాలు జరుగకుండా ఉన్నారు. తాజాగా సర్కారు ప్రకటించిన లక్ష రూపాయల సహాయంతో ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా లాభం చేకూరనున్నది. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. కౌండిన్య గౌడ సంఘం తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– కేఎల్ఎన్ ప్రసాద్, కౌండిన్య గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు (కోదాడ టౌన్)
సర్కారు సాయం వృత్తిదారులకు ఎంతో ఆసరా
కుల వృత్తిదారులకు లక్ష రూపాయల సహాయం అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉంది. సెలూన్లకు ఉచితంగా నెలకు 250 యూనిట్ల విద్యుత్ను అందజేసి ఆదుకుంటున్న ప్రభుత్వం.. వృత్తిని మరింతగా ప్రోత్సహించేందుకు రూ.లక్ష సహాయం అందివ్వడం హర్షణీయం. వచ్చే నెల 2నుంచి 21వ తేదీ వరకు రాష్ట్ర ఆవిర్భావ శతాబ్ది ఉత్సవాల్లో కుల వృత్తులకు సహాయం అందజేస్తామని కేబినేట్లో నిర్ణయించడం ఆనందంగా ఉంది.
– రాచమల్ల దుర్గయ్య, నాయీబ్రాహ్మణుడు, ఆత్మకూరు(ఎం)
ఉచిత కరెంట్, రూ.లక్ష సాయం హర్షణీయం
గతంలో ఇస్త్రీ డబ్బా నడిపితే బొగ్గులకు దేవులాట ఉండేది. బొగ్గులు లేక దుకాణం బంద్ చేసి పస్తులున్న రోజులు చాలా ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్త్రీ దుకాణాలకు ఉచిత కరెంట్ ఇవ్వడం మాకు ఆర్థికంగా భరోసానిచ్చింది. ఉచిత కరెంట్ వచ్చాక బొగ్గులకు దేవులాడాల్సిన పని లేకుండా కరెంట్ ఇస్త్రీ పెట్టెతో వృత్తిని సాగించి ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్నాం. కనుమరుగవుతున్న కుల వృత్తులను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. లక్ష రూపాయల సహాయం నిరుపేదలైన వృత్తిదారులకు ఎంతో ఉపయోగపడుతుంది. వృత్తులకు జీవం పోస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మేమంతా రుణపడి ఉంటాం.
– ప్రసాద్, రజక వృత్తిదారుడు, సూర్యాపేట
ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పటికీ అవసరం
కుల వృత్తులను ప్రోత్సహించడంతోపాటు ఆర్థికంగా ఎదిగేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేయడం హర్షణీయం. ఇప్పటికే లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతోపాటు కుల వృత్తులకు లక్ష రూపాయల సహాయం అందజేస్తామని ప్రకటించడం సంతోషకరం. ఇలాంటి ముఖ్యమంత్రి ఎప్పటికీ ఉండాలి.
– ఎలిమినేటి యాదయ్య, రజక వృత్తిదారుడు, ఆత్మకూరు(ఎం)
వృత్తిదారుల గౌరవాన్ని పెంచారు
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కుల వృత్తులకు తగిన గుర్తింపు ఇస్తూ గౌరవాన్ని పెంచారు. లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించడం హర్షణీయం. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో చాలా మంది యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా తమ వృత్తులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం ఇస్తామన్న లక్ష రూపాయల ఆర్థిక సహాయం కులవృత్తి చేపట్టిన యువకులకు ఎంతో బాసటగా ఉంటుంది. ఇప్పటికే సెలూన్లకు ఉచిత కరెంట్ ఇస్తూ.. ప్రస్తుతం లక్ష రూపాయల రుణం అందిస్తామన్న కేసీఆర్ సార్కు వృత్తిదారులంతా రుణపడి ఉంటారు.
– జంపాల శ్రీనివాస్, నాయీబ్రాహ్మణుడు, సూర్యాపేట