కొండమల్లేపల్లి, డిసెంబర్ 24 : రాబోయే రెండు మూడేండ్లలో దేవరకొండ నియోజక వర్గంలోని డిండి ఎత్తిపోతల, పెండ్లిపాకల రిజర్వాయర్, నక్కలగండి తదితర పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్లను పూర్తి చేసి 1.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే బాలూనాయక్ తెలిపారు. అదివారం మండల కేంద్రంలోని కన్యక పరమేశ్వరి అలయంలో ఎమ్మెల్యే పూజలు నిర్వహించారు.
అనంతరం దేవరకొండ ఎమ్మెల్యేగా ఎన్నికై మొదటిసారి మండల కేంద్రానికి వచ్చిన సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యర్యంలో ఎమ్మెల్యేకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీపీ దూదిపాల రేఖాశ్రీధర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దూదిపాల వేణూధర్రెడ్డి, దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆల్లంపల్లి నర్సింహ, వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, కో ఆప్షన్ మెంబర్ ఎంఏ ఖైసర్ఖాన్, ఉప సర్పంచ్ గంధం సురేశ్, నాయిని మాధవరెడ్డి, ఉట్కూరి వేమన్రెడ్డి, పూరే జనార్దన్, నీలా లక్ష్మయ్య, నీలం శ్రీనివాస్, రామకృష్ణ, అందుగుల ముత్యాలు పాల్గొన్నారు.
చందంపేట : మండలంలోని కంబాలపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన మహాలక్ష్మమ్మ జాతరలో ఎమ్మెల్యే బాలూనాయక్ పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించింది. ఎంపీపీ పార్వతీచందునాయక్, జడ్పీటీసీ బుజ్జి లచ్చిరామ్నాయక్, పీఏసీఎస్ చైర్మన్ జాలె నర్సింహారెడ్డి, దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, ఎంపీపీ జాన్యాదవ్ పాల్గొన్నారు.
నేరెడుగొమ్ము(చందంపేట) : నేరెడుగొమ్ము మండలంలోని చిన్నమునిగల్కి చెందిన బానోతు సునీల్, సంధ్య దంపతులు ఇటీవల మృతిచెందారు. దాంతో వారి కుమార్తె సంజన చదువుకు అయ్యే ఖర్చును భరించేందుకు జీఆర్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఆదివారం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారికి ఎమ్మెల్యే బాలూనాయక్ చేతుల మీదుగా రూ.5 వేలను ఆర్థిక సాయంగా అందజేసింది.