రామగిరి, ఏప్రిల్ 20 : ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యూయేషన్(మూల్యాంకనం) గురువారం ముగిసింది. మార్చి 31న ప్రారంభమైన మూల్యాంకనం ప్రక్రియలో 2,701 మంది వివిధ సబ్జెక్టులకు సంబంధించిన అధ్యాపకులు, అధికారులు హాజరై విజయవంతంగా పూర్తి చేశారు.
జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జరిగిన మూల్యాంకనంలో 5.20 లక్షల జవాబు ప్రతాల మూల్యాంకనాన్ని పారదర్శకంగా పూర్తి చేసినట్లు డీఐఈఓ దస్రూనాయక్ తెలిపారు. కాగా ప్రస్తుతం ఇంటర్నల్ అంశాలకు సంబంధించిన వర్క్ పూర్తి చేస్తున్నట్లు డీఐఈఓ వెల్లడించారు.