ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 111 కేంద్రాల్లో తెలుగు, ఉర్దూ, అరబిక్, సంస్కృతం, హిందీ పరీక్షలు జరుగగా 29,576 మంది విద్యార్థులకుగానూ 28,467 మంది హాజరయ్యారు. పలు పరీక్ష కేంద్రాలను డీఐఈఓ దస్రునాయక్ పరిశీలించారు.
– రామగిరి, మార్చి 16
రామగిరి, మార్చి 16 : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. 111 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా రెగ్యూలర్, ఒకేషనల్ విభాగంలో 29,576 మందికి గాను 28,467మంది హాజరు కాగా 1,109 మంది గైర్హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో పరీక్షా కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతి తనిఖీ చేసి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అలాగే నల్లగొండ, సూర్యాపేటలో డీఐఈఓలు దస్రూనాయక్, కృష్ణయ్యతో పాటు ప్రత్యేక కమిటీ సభ్యులు పరీక్షా కేంద్రాలను తనిఖీలు చేశారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల హాజరు
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఇంటర్మిడియేట్ సెకండియర్ పరీక్షలకు రెగ్యూలర్, ఒకేషనల్ విభాగంలో 29,576 మందికి గాను 28,467 మంది హాజరు కాగా 1,109 మంది గైర్హాజరయ్యారు. వీరిలో రెగ్యూలర్ విభాగంలో 25,477 మందికి 24,671 మంది హాజరు కాగా 908 గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ విభాగంలో 4,099 మందికి గాను 3,796 మంది హాజరు కాగా 303 మంది గైర్హాజరయ్యారు.