నీలగిరి, నవంబర్ 29 : నల్లగొండ పట్టణాన్ని ఆరు నెలల్లో రోల్మోడల్గా తీర్చిదిద్దుతానని కంచర్ల భూపాల్రెడ్డి తెలిపారు. పట్టణంలోని ఎన్జీ కళాశాల, భాస్కర్ టాకీస్, సుభాశ్ విగ్రహం, క్లాక్ టవర్ జంక్షన్లు సందర్శించి అక్కడ జరుగుతున్న ఆధునీకరణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. డీఈఓ కార్యాలయంవద్ద జంక్షన్ ఎంత వైశాల్యంలో పనులు చేపడు తున్నా రో కమిషనర్ రమణాచారిని అడిగి తెలుసుకున్నా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రగతి పనులు పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా వేగంగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, కౌన్సిలర్లు బోయినపల్లి శ్రీనివాస్, గోగుల శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్, యామ కవితారాణీదయాకర్, దండెంపల్లి సత్తయ్య,సీపీనాగిరెడ్డి, ఈఈ ఆశోక్ ఉన్నారు.
రేగట్టె గ్రామాన్ని సస్యశ్యామలం చేస్తా
కనగల్ : మండలంలోని రేగట్టె గ్రామ శివారులో ఉన్న మునుగోడు మండలం కొరటికల్ గ్రామపరిధిలో ఉన్న జిల్లాయిపేట చెరువును నింపి రేగట్టె గ్రామాన్ని సాగునీటితో సస్యశ్యామలం చేస్తానని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. చండూరు మండలం పడమటితాళ్ల వాగుపై నిర్మిస్తున్న చెక్డ్యాం, జిల్లాయిపేట చెరువును మంగళవారం ఆయయన పరిశీలించారు. ఈ చెక్ డ్యాం నుంచి స్లూయిట్ ఏర్పాటు చేసి జిల్లాయిపేట చెరువుకు నింపేందుకు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించాడు. అందుకు అవసరమైన నిధు ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం త్వరలోనే స్లూయిజ్ ద్వారా నీటిని తెప్పించేందుకు కృషిచేస్తానన్నారు. ఆయన వెంట డీఈఈ కాశీం, ఏఈ రఘు, రవీందర్, ఎంపీపీ కరీంపాషా, జడ్పీటీసీ చిట్ల వెంకటేశంగౌడ్, సర్పంచ్ కడారి కృష్ణయ్య, మాజీ జడ్పీటీసీ ఎర్రోళ్ల సంజీవ, ఎర్రబెల్లి నర్సిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్, టీఆర్ఎస్మండలాధ్యక్షుడు యాదయ్యగౌడ్ పాల్గొన్నారు.
రోడు విస్తరణ పనుల పరిశీలన
తిప్పర్తి: మండలంలోని దుప్పలపల్లి బైపాస్ రోడ్డు నుంచి నల్లగొండ పట్టణానికి వచ్చే రోడ్డు విస్తరణ పనులనుఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు పనుల్లో నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని సూచించారు. రోడ్డు పక్కన ఉన్న బావిని పూడ్చి వేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బొంత వెంకటయ్య, అధికారులు పాల్గొన్నారు.k