రామగిరి, ఫిబ్రవరి 26 : నల్లగొండ జిల్లా కోర్టు ఆవరణలో నిర్మిసున్న కోర్టు భవనాలు, నూతన సముదాయాలను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, హైకోర్టు సీనియర్ జడ్జి నవీన్రావు, జిల్లా పోర్టుపోలియో జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్ అన్నారు. ఆదివారం రాత్రి జిల్లా కోర్టుకు వచ్చిన వారికి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఎస్.జగ్జీవన్కుమార్, కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. తొలుత కోర్టు ఆవరణలోని జ్యుడీషియల్ గెస్ట్ హౌస్కు చేరుకుని అక్కడి నుంచి న్యాయ సేవా సదస్సును సందర్శించారు. అదే విధంగా కోర్టు ఆవరణలో నిర్మాణంలో ఉన్న భవన సముదాయాన్ని పరిశీలించారు. అనంతరం కోర్టు ఆవరణలో నిర్మించే సోలార్ సిస్టం, ఓపెన్ ఆడిటోరియం నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా కోర్టు స్టాఫ్ డైనింగ్ హాల్, నవీకరించిన సమావేశ వేదికను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కక్షిదారులకు న్యాయ సేవలను విస్తృతం చేసేందుకు న్యాయస్థానాలు, తమ అధికారులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సత్వర న్యాయానికి లోక్ అదాలత్లను ఏర్పాటు చేస్తున్నామని వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం జిల్లా కోర్టులోని వివిధ న్యాయస్థానాల న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్వర్యంలో వారిని ఘనంగా స న్మానించి జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికారి సంస్థ అధికారి బి.దీప్తి, జయరాజ్, కార్తీక్, తిరుపతి, శ్రీవాణి, డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులు భీమార్జున్రెడ్డి, సీనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.