నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సమక్షంలో 200మంది బెంగాలీ స్వర్ణకారులు ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
భీమ్గల్,ఆక్టోబర్ 29: భీమ్గల్ మండల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఆదివారం మండలంలోని లింబాద్రి లక్ష్మీనరసింహ స్వామి గుడి వద్ద నిర్వహించారు. బీఆర్ఎస్ శ్రేణులు, వీపీఆర్ సైనిక్ టీం సభ్యులు సుమారు రెండువేల మంది వెయ్యికి పైగా మోటర్ సైకిళ్లపై భీమ్గల్ సబ్స్టేషన్ నుంచి లింబాద్రి గుట్ట వరకు భారీ ర్యాలీ నిర్వహించి మంత్రి వేములకు ఘన స్వాగతం పలికారు.
కార్యకర్తల సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలతా సురేందర్, ఎంపీపీ మహేశ్, జడ్పీటీసీ రవి, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గుణ్వీర్ రెడ్డి, సొసైటీ చైర్మన్లు నర్సయ్య, వెంకటేశ్, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు పసుల ముత్తెన్న, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మొయిజ్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు శర్మానాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్య, పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, గామశాఖ అధ్యక్షులు నాయకలు, కార్యకర్తలు పాల్గొన్నారు.