హాలియా, ఏప్రిల్ 7 : నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రోడ్లు కంకరతేలి, గుంతలమయంగా అధ్వానంగా తయారయ్యాయి. రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. అనుముల మండలంలో పేరూరు నుంచి వీర్లగడ్డతండా, తిమ్మాపురం నుంచి యాచారం, రామడుగు, చింతగూడెం, సూరేపల్లి రహదారులు గుంతలమయంగా మారాయి. త్రిపురారం మండలంలో రాగడప నుంచి మేగ్యాతండా, బొర్రాయిపాలెం నుంచి బడాయిగడ్డ, త్రిపురారం నుంచి మారెమ్మగూడెం, చెన్నాయిపాలెం, మాటూర్, సత్యనారాయణపురం నుంచి నీలాయిగూడెం, ముకుందాపురం నుంచి కంపాసాగర్, కొణతాలపల్లి, కామారెడ్డిగూడెం నుంచి మునగబావిగూడెం, దుగ్యాపల్లి నుంచి గుంటిపల్లి వరకు రోడ్డు అధ్వానంగా మారింది.
గుర్రంపోడు మండలంలో కొప్పోలు నుంచి వట్టికోడు వరకు, చామలేడు నుంచి పిట్టలగూడెం, చామలోనిబావి, ఆమలూరు నుంచి ముక్కముల, జూనూతల నుంచి సుల్తాన్పురం, వెంకటాపురం వరకు గుంతలమయంగా పడ్డారు. నిడమనూరు బంకాపురం నుంచి వెనిగండ్ల, సూరేపల్లి రహదారి, తుమ్మడం నుంచి వల్లభాపురం, వడ్డేరగూడెం, ఊట్కూర్ నుంచి నందికొండవారిగూడెం రహదారులు అధ్వానంగా ఉన్నాయి. పెద్దవూర మండలంలో పెద్దగూడెం నుంచి కొత్తలూరు. పోతునూర్ నుంచి పులిచర్ల, ముత్యాలమ్మ గుడితండా వరకు గ్రామీణ రహదారులపై మొకాలలోతు గుంతలు పడ్డాయి. రోడ్డుకు మరమ్మత చేపట్టాలని నాయకులు, అధికారులకు విన్నవించినప్పటికీ స్పందించడం లేదని వాహనదారులు వాపోతున్నారు.
హాలియా నుంచి వీర్లగడ్డవరకు రోడ్డు అంతా గుంతలమయంగా మారింది. శివరాత్రి పండుగ సందర్భంగా హాలియా నుంచి పేరూరు వరకు జాతర కోసం రోడ్డుపై గుంతలు పూడ్చారు. కానీ పేరూరు నుంచి మా ఊరి వరకు రహదారిని బాగు చేయలేదు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతు నిర్వహించడమా లేక బీటీ రోడ్డు వేయాలి.
– మురళినాయక్, వీర్లగడ్డతండా
హాలియా నుంచి సూరేపల్లి వచ్చే రో డ్డు అధ్వానంగా తయరైనా పట్టించుకునే వారే లేరు. రోడ్డు అధ్వానంగా ఉండటం వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయి అధికారులు స్పందించి రోడ్డుకు మరామత్తులు నిర్వహించాలి.
– జానపాటి సైదులు, వాహనదారుడు, సూరేపల్లి