అర్వపల్లి, ఏప్రిల్ 19 : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకట్రావ్ ఆదేశించారు. శుక్రవారం అర్వపల్లి ఐకేపీ సెంటర్ను పరిశీలించి మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతులకు డబ్బులు వచ్చేందుకు ట్యాబ్ ఎంట్రీని వెంటనే చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా సంబంధిత సెంటర్ ఇన్చార్జి లారీల కొరత ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ట్రాన్స్పోర్టు అధికారితో ఫోన్లో మాట్లాడి, ప్రతిరోజు సెంబర్కు 3 నుంచి 4 లారీలు పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్రెడ్డి, తాసీల్దార్ శ్రీనివాసులు, ఏఓ శశిధర్రెడ్డి, ఏపీఎం వలిశెట్టి మల్లేశ్, ఏఈఓ శోభారాణి, సెంటర్ నిర్వాహకులు, రైతులు పాల్గొన్నారు.