మిర్యాలగూడ రూరల్, అక్టోబర్ 5 : సీఎం కేసీఆర్ పాలనలో అందరికీ సమాన విద్య అందుతుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మండలంలోని శ్రీనివాస్నగర్ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా స్థాయి బీసీ బాలికల గురుకుల పాఠశాలల క్రీడ పోటీలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల కేవలం 228 గురుకుల పాఠశాలలు ఉంటే రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కొత్తగా 773 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్లు ఏ రాష్ట్రంలో లేవని అన్నారు.
జిల్లా కో వైద్య కళాశాలను ఏర్పాటు చేసి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నదన్నారు. అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి, గురుకుల సీఈఓ ఎం.షెకీన, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మట్టపల్లి సైదులు యాదవ్, ఎంపీడీఓ గార్లపాటి జ్యోతీలక్ష్మి, ఎంఈఓ బాలాజీ నాయక్, పాఠశాల ప్రిన్సిపాల్ కొండకింది నర్సింహరెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు గడగోజు ఏడుకొండలు, సర్పంచ్ బోగవల్లి వెంకటరమణ చౌదరి ,శ్రీనివాస్రెడ్డి, అశోక్రెడ్డి, ఎంపీటీసీ సుజాతపాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మాడ్గులపల్లి : మండలంలోని కుక్కడం-పూసలపాడు గ్రామం వరకు రూ.60 లక్షలతో 3.8 కి.మీ మేరా నిర్మించనున్న రోడ్డు, గండ్రవానిగూడెంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ, సీత్యాతండాలో రూ.2.40 కోట్లతో చేపట్టే బీటీ రోడ్డు, రూ.10 కోట్లతో నిర్మించే లిఫ్టు నిర్మాణ పనులకు, బొమ్మకల్లో రూ.3.95 కోట్లతో నిర్మించే చెక్డ్యామ్, కల్వలపాలెంలో రూ.7.36 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం, ఆగామోత్కూర్లో రూ.3.28 కోట్లతో నిర్మించే బ్రిడ్జి నిర్మాణ, రూ.3.41కోట్లతో నిర్మించే చెక్ డ్యామ్ నిర్మాణ, చిరుమర్తిలో రూ4.16 కోట్లతో చెక్ డ్యామ్ నిర్మాణ, పాములపహాడ్ గ్రామంలో రూ.40 లక్షలతో 4 కి.మీ మేరారోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన, రూ.10 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు.
గత ప్రభుత్వాలు హయాంతో దరఖాస్తు ఇచ్చి దండం పెట్టినా పట్టించుకున్న పాపాన పోలేదని కాని సీఎం కేసీఆర్ అడగకున్నా గ్రామాల అభివృద్ధికి అనేక నిధులు విడుదల చేసి మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే భాస్కర్రావు మాట్లాడుతూ ప్రజలందరూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేసి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు.
బతుకమ్మ చీరెల పంపిణీ
అలాగే బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పంపిణి చేసిన బతుకమ్మ చీరెలను ఆయా గ్రామాల్లోని మహిళలకు అందజేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ పోకల శ్రీవిద్యారాజు, బీ ఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాలుట్ల బాబయ్య, ఆర్డీఓ చెన్నయ్య, పీఆర్ఏఈ నరేశ్, ఎంపీడీఓ దండా జితేందర్రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు మోసిన్అలీ, రాష్ట్ర నాయకుడు నిమ్మల నవీన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాములుగౌడ్, సర్పంచులు అలుగుబెల్లి గోవింద్రెడ్డి, చింతకుంట్ల శ్రీనివాస్రెడ్డి, వాంకుడోతు సుధాకర్, మారుతి వెంకట్రెడ్డి, మహమ్మద్ అఫ్ఝల్, నాంపల్లి శ్రీశైలం, యాతం లక్ష్మి, ఎంపీటీసీ కత్తి కనకారెడ్డి, నాయకులు పొనుగోటి చొక్కారావు, పోకల రాజు, చింతకాయల సైదులు, వెంకటాచారి, ఇంద్రారెడ్డి, రాయారపు వెంకన్న పాల్గొన్నారు.