కొండమల్లేపల్లి, అక్టోబర్ 20 : కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంతో పాటు, 60ఏండ్ల పాలనలో కరెంట్ కష్టాలు, ప్రజల బాధలు ఎలా ఉండేవో నేటి తరానికి వివరించాలని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ కార్యకర్తలు, నాయకులను కోరారు. మండల కేంద్రంలోని సాయకృప ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, బూత్ స్థాయి కమిటీ మెంబర్లు గ్రామాల్లో ప్రతి ఓటరును కలిసి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించి ఓట్లు అభ్యర్థించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ ఎత్తులను చిత్తు చేయాలని పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్ కుటుంబ పెద్దలా ఆలోచించి మ్యానిఫెస్టో రూపొందించారన్నారు. నమ్మకానికి మారు పేరు సీఎం కేసీఆర్ అయితే నయవంచనకు మారుపేరుగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో ప్రజల హృదయాలు ఆనందంతో పొంగుతుంటే ప్రతిపక్షాల గుండెలు జారి పోయాయన్నారు. కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా, సౌభాగ్యలక్ష్మి వంటి పథకాలను మహిళల కోసం తీసుకొచ్చారన్నారు. గ్యాస్ సిలిండర్తో బీజేపీ సెగ పెడితే, సీఎం కేసీఆర్ మాత్రం సిలిండర్ను రూ.400కే అందించే నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. అసరా పింఛన్లు, రైతుబంధు పెంపు నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నారు. తొమ్మిదేండ్ల పాలనలో దేవరకొండ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో నిరాటంకంగా కొనసాగుతున్న సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి మరోసారి పట్టం కడుతాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసేలా ప్రతి కార్యకర్త, నాయకుడు సైనికుల్లా పని చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కేతావత్ బిల్యానాయక్, మారం రవీందర్రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కుంభం శ్రీనివాస్గౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, జడ్పీటీసీ సలహాదారుడు పస్నూరి యుగేంధర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమావత్ దస్రూనాయక్, పట్టణాధ్యక్షుడు ఎలిమినేటి సాయి, ఉప సర్పంచ్ గంధం సురేశ్, లక్కీదాస్, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్యాదవ్, మాడ్గుల యాదగిరి, లాలూనాయక్, మూడావత్ పాండు, రావుల వెంకటయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు కార్యకర్తల పాల్గొన్నారు.
దేవరకొండ, అక్టోబర్ 20 : బీఆర్ఎస్ గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ కోరారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నేరేడుగొమ్ము, చందంపేట మండలాల ముఖ్య కార్యకర్తలతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీల తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. దేవరకొండ ఖిల్లాపై మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో జడ్పీటీసీ కేతావత్ బాలూనాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లోకసాని తిరుపతయ్య, ముత్యాల సర్వయ్య, ఎంపీపీ సలహాదారుడు బాణావత్ హన్మనాయక్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు దొండేటి మల్లారెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు బోయపల్లి శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీపీ ఏర్పుల గోవింద్యాదవ్, యాసాని రాజవర్దన్రెడ్డి, గోసుల అనంతగిరి, లక్ష్మణ్నాయక్, మోహన్కృష్ణ, రవీందర్, కొండల్రెడ్డి, శంకర్నాయక్, లోక్యనాయక్, శవ్వ నారాయణ పాల్గొన్నారు.