చివ్వెంల, అక్టోబర్ 5 : యాదవుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కొనియాడారు. గురువారం ఆయన ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్తో కలిసి రూ.50లక్షలతో చేపడుతున్న పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆలయ గోపురాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ గత పాలకులు ఏనాడూ పెద్దగట్టును పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే కొనేరు, గెస్ట్ హౌస్, పూజారుల విశ్రాంతి భవనం, కార్యాలయం, విద్యుదీకరణ పనులు శాశ్వత ప్రాతిపదికన నిర్మించామని తెలిపారు. రెండేండ్లకు ఒకసారి నిర్వహించే జాతర ఏర్పాట్లకు కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
త్వరలో సూర్యాపేటలో కనీవిని ఎరుగని రీతిలో యాదవ సంక్షేమ భవన్ నిర్మాణానికి శ్రీకారం చుడుతామని తెలిపారు. కార్యక్రమంలో పెద్దగట్టు చైర్మన్ కోడి సైదులుయాదవ్, సత్యనారాయణ పిైళ్లె, కౌన్సిలర్లు లక్ష్మీ మకట్ లాల్, బాషా, జానీ, లక్ష్మి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ జూలకంటి జీవన్ రెడ్డి, జిల్లా నాయకులు రామగిరి నగేశ్, గుర్రం సత్యనారాయణరెడ్డి, ఉప్పుల ఆనంద్, మద్ది శ్రీనివాస్ యదవ్, శ్రీనివాస్, జటంగి వెంకటేశ్వర్లు, రాము, అనిల్, శ్రీనివాస్, సైదులు, యాదగిరి, నాగయ్య పాల్గొన్నారు.