గట్టుప్పల్, మార్చి 02 : ఎన్నికలలో చేనేతల రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత దానిని రూ.లక్షకు కుదించి చేనేతల పట్ల చిన్నచూపు చూస్తున్నారని బీఆర్ఎస్ గట్టుప్పల్ మండల కన్వీనర్ ఇడం కైలాసం అన్నారు. సోమవారం గట్టుప్పల్ మండల కేంద్రంలో చేనేత కార్మికులతో సమావేశమై మాట్లాడారు. ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీ కూడా పట్టణ ప్రాంతాలకే పరిమితం చేసి గ్రామీణ ప్రాంత చేనేత కార్మికులకు ఇవ్వలేదని మండిపడ్డారు. వెంటనే రుణ మాఫీ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అదేవిధంగా చేనేత భరోసా, త్రిఫ్ట్ ఫండ్ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. వెంటనే విడుదల చేయకపోతే త్వరలో ఉద్యమ బాట పడతామని అందులో భాగంగా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడతామన్నారు. అనంతరం చేనేత మగ్గాలను పరిశీలించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు గంజి పెద్దలు, బడుగు తిమ్మయ్య, నామని గణేశ, రవ్వ రాములు, సూరేపల్లి బుచ్చయ్య, పులిపాటి వెంకటేశం, పెదగాని రాములు, చెరిపల్లి రమేశ్, గుర్రం రాఘవేంద్ర పాల్గొన్నారు.