హాలియా: పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవారం హాలియాలోని క్యాంపు కార్యాలయంలో అనుముల, తిరుమలగిరిసాగర్, పెద్దవూర మండలాలకు చెందిన సుమారు 30మందికి 16లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవేట్, కార్పొరేట్ దవాఖానల్లో మెరుగైన వైద్యం చేయించుకున్న పేదలు అప్పుల పాలు కాకూడదనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. పేదలకు సీఎంఆర్ఎఫ్ వరం లాంటిదని అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో అనుముల, తిరుమలగిరి సాగర్ మండల పార్టీ అధ్యక్షులు కురాకుల వెంకటేశ్వర్లు, పిడిగం నాగయ్య, మండల ప్రధాన కార్యదర్శి ఎన్నమల్ల సత్యం, పట్టణాధ్యక్షుడు చెరుపల్లి ముత్యాలు, పేరూరు దేవస్థాన కమిటీ చైర్మన్ రాయనబోయిన రామలింగయ్య, టీఆర్ఎస్ పోశం శ్రీనివాస్, దోరేపల్లి వెంకన్న, గడ్డం రమణయ్య, యడవల్లి నాగరాజు, జానకిరాములు, షకీల్ తదితరులు పాల్గొన్నారు.
గుర్రంపోడు: దవాఖాన ఖర్చులు భరించలేని నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నలుగురు లబ్ధిదారులకు రూ.1,37,500 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, మాజీ జడ్పీటీసీ గాలి రవికుమార్, మండలాధ్యక్షుడు గజ్జెల చెన్నారెడ్డి, స్థానిక సర్పంచ్ మస్రత్ సయ్యద్మియా, నాయకులు వజ్జ ధనుంజయ, దోటి చంద్ర మౌళి, కుప్ప పృధ్వీరాజ్, సర్పంచ్ రావులపాటి భాస్కర్, చక్రవర్తి, సింగం ప్రవీణ్, శ్రీవాణి, కిరణ్, సిరాజ్, పాల్గొన్నారు.