హాలియా, పెద్దవూర : రాష్ట్రంలో ప్రతి ఇంటికి తాగునీటిని అందించి ప్రజల దాహార్తిని తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని నాగా ర్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. బుధవారం అనుముల మండలం పంగవానికుంట, కొత్తపల్లి, తిమ్మాపు రం, చింతగూడెం, హాజారిగూడెం గ్రామాల్లో, పెద్దవూర మండలంలోని గేమ్యనాయక్ తండా, ఊట్లపల్లి, జయరాం తండా, మర్రి పూరితండా, పాల్తీ తండా, రామన్నగూడెం, చలకుర్తి, తూర్పు పూలగూడెం, కుంకుడు చెట్టు తండాల్లో ప్రజలకు తాగునీరు అందించేందుకు మీషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్ధాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా నియోజకవర్గంలో ప్రజలు తాగునీటిని నోచు కోలేదన్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక ప్రజల దాహర్తిని తీర్చాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఇంటికి మంచినీటి నల్లా సౌకర్యం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందన్నారు.