గురుపౌర్ణమి వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సాయి బాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు కొనసాగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. నల్లగొండ, చిట్యాలలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, సూర్యాపేటలో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ/రామగిరి, జూలై 3: గురుపౌర్ణమి వేడుకలను జిల్లా ప్రజలు సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈ సందర్భంగా షిర్డీ సాయి ఆలయాలు అఖండ సాయినామస్మరణతో మారుమోగాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మిర్యాలగూడలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రామగిరి, ముషంపల్లిరోడ్డులోని షిర్డిసాయిబాబ ఆలయంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. నకిరేకల్ పట్టణంలోని సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చిట్యాలలో మండలి చైర్మన్ గుత్తా పూజలు
చిట్యాల మండలం వట్టిమర్తి శివారులో జాతీయ రహదారిపై గల సాయిబాబా దేవాలయంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వేర్వేరుగాప్రత్యేక పూజలు నిర్వహించారు.