దామరచర్ల :ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికార్లు కోరారు. మండల కేంద్రంలోని సబ్మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఏఈవోలు పార్వతి, ప్రియాంకలు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని తీసుకొని రావాలన్నారు.
వారికి అన్ని రకాల సదుపాయలు, వసతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రెండురోజుల్లో కొనుగోలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ సీఈవో వెంకటరెడ్డి, మట్టయ్య, వీరస్వామి, గోవిందులు పాల్గొన్నారు.