కట్టంగూర్, అక్టోబర్ 24:కట్టంగూర్ మం డలంలో గురు, శుక్రవారాల్లో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచి ముద్దయింది. మునుకుం ట్ల, కల్మెర, నారెగూడెం, పరడ, అయిటిపాముల, ఈదులూరు కురుమర్తి, బొల్లెపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేం ద్రాల్లోని ధాన్యం కుప్పలు వర్షానికి తడిచిపోయాయి. కల్మెరలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం లోతట్టు ప్రాంతం కావడంతో భారీ వర్షానికి రైతుల ధాన్యం రాసులు నీటిలో కొట్టుకుపోయాయి. కొనుగోలు కేంద్రం పక్కనే ఉన్న వరద కాలువను ఆ ప్రాంతంలోని రైతులు ధ్వం సం చేసి ఆక్రమించడంతో వరద నీరంతా కొనుగోలు కేంద్రంలోకి చేరడంతో ధాన్యం రాసులు నీటిలో మునిగిపోయా యి. వర్షాలకు కేంద్రా ల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఐకేపీ, పీఏసీఎస్ అధికారులు మాత్రం కేంద్రా ల వైపు కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ధాన్యం తెచ్చి పది రోజులవుతున్నా మ్యాచర్ రావడం లేదనే సాగుతో కాంటాలు వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిచి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కల్మెర పీఏసీఎస్ కేంద్రంలో నిలిచి వర్షపు నీటిని తహసీల్దార్ పుష్పలత జేసీబీ సహాయంతో తరలించారు.
కొనుగోళ్లు వెంటనే ప్రారంభించాలి
కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిచిపోవడం తో నష్టపోయాం. వారం రోజుల క్రితం ఐదు ఎకరాల ధాన్యాన్ని కల్మెర పీఏసీఎస్ కేం ద్రానికి తెచ్చి ఆరబెడుతున్నాం. కేంద్రా న్ని ప్రారంభించి మ్యాచర్ రావడం లేద ని అధికారులు కాంటా వేయడం లేదు. రాత్రి, పగలు కేంద్రాల్లో పడిగాపులు కా స్తున్నాం. అకాల వర్షానికి ధా న్యం నీటి లో కొట్టుకుపోయింది. తడిచి ధాన్యా న్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి.
– వనం శ్రీను, రైతు, దుగినవెల్లి