నల్లగొండ : సామాన్యుడికి కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పం.
కార్పొరేట్ హాస్పిటల్స్కు దీటుగా ప్రభుత్వ దవాఖానలురూపొందుతున్నాయని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. కార్పొరేటక్కు మించి వైద్య సదుపాయాలు ప్రస్తుతం ప్రభుత్వ దవాఖానల్లోనే లభిస్తున్నాయని ఆయన తెలిపారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఆధునిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఆపరేషన్ థియేటర్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కున్న దార్శనికతకు ఇది చక్కటి నిదర్శనమన్నారు.
జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైద్య సేవలు అప్డేట్ అవుతున్నాయన్నారు. అందులో భాగంగానే చెవి, ముక్కు, గొంతు లకు సంబంధించిన ఆపరేషన్ థియేటర్లు ఈ రోజు ప్రారంభించుకున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి, డాక్టర్ లచ్చు తదితరులు పాల్గొన్నారు.