నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. బుధవారం కట్టంగూర్ మండలం గార్లబాయీ గూడెంలో రూ.25 లక్షలతో పలు అవివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం చెర్వు అన్నారం గ్రామంలో రూ.70లక్షలతో ప్రభుత్వ పాఠశాలల్లో పలు అభివృద్ధి పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేస్తామని తెలిపారు. మన ఊరు-మన బడి పనులు త్వరగా పూర్తి చేయాలి అధికారులకు సూచించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించడంతో పాటు విద్యా ప్రమాణాలను పెంపొందించే ఉక్కు సంకల్పంతో ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు చిత్తశుద్ధితో షెడ్యూల్ ప్రకారం త్వరితగతిన పనులను పూర్తి చేయాలన్నారు.