నల్లగొండ : నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సేవలను ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలి డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ యూపీఐ సేవలను చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. బ్యాంకు నల్లగొండ ప్రధాన కార్యాలయంలో డీసీసీబీ చైర్మన్ అండ్ టెస్కాబ్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులతో కలిసి ఫోన్ పే మరియు గూగుల్ పే వాట్సప్, పేటీఎం లాంటి upi సేవలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ..ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 2, 76,000 మంది ఖాతాదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. యూపీఐ సేవల ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా రైతులకు ఖాతాదారులకు బ్యాంకు సిబ్బందికి తదితరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, నాబార్డు బీడీఎం బ్యాంక్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.