నల్గొండ : జిల్లాలోని హాలియా మండల కేంద్రంలో ఎస్సై క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో కేజీ గంజాయిని సీజ్ చేశారు. ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన ఉప్పుతోళ్ల రవణమ్మ(56) ఒక ప్లాస్టిక్ సంచిలో కేజీ గంజాయిని హాలియాకు తీసుకొని వచ్చింది. ఆ సంచిని హాలియాకు చెందిన ఆంజనేయులుకు ఇస్తుండగా విశ్వసనీయ వ్యక్తులు అందించిన సమాచారం మేరకు హాలియా ఎస్ఐ క్రాంతికుమార్ గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనుముల మండలం తాసిల్దార్ లాహోరి మంగ సమక్షంలో పంచనామా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ క్రాంతికుమార్ మాట్లాడుతూ.. గుట్కా గంజాయి వంటి మాధక ద్రవ్యాలను తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో.. వీటిని ఎవరైనా విక్రయించినా.. వాడినా.. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.