హాలియా, డిసెంబర్ 15: ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, గెలిచినా.. ఓడినా ప్రజల మధ్యే ఉంటానని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. శుక్రవారం హాలియాలోని తన నివాసంలో గతంలో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అలాగే ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పెద్దవూర మండలం పులిచర్ల గ్రామానికి చెందిన సాగర్ కుటుం సభ్యులకు పార్టీ ప్రమాదబీమా చెక్కు 2 లక్షల రూపాయలను ఇచ్చారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. రైతుబంధు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మాట తప్పిందన్నారు. రైతుబంధు పథకం కింద 15వేల రూపాయల పెట్టుబడి సహాయం చేస్తామని చెప్పి తీరా అధికారంలోనికి వచ్చాక పాత పద్ధతిలోనే రైతుబంధు ఇవ్వడం సరైంది కాదని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్దవూర మండల శాఖ అధ్యక్షుడు రవినాయక్, మార్కెట్ డైరెక్టర్ పోదిల శ్రీనివాస్, గ్రామశాఖ అధ్యక్షుడు చెన్ను వెంకట్రెడ్డి, లాలునాయక్, లక్ష్మణ్నాయక్ పాల్గొన్నారు.