గుర్రంపోడు, డిసెంబర్ 16: మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.68,000 విలువ గల చెకులను మాజీ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ శనివారం పంపిణీ చేశారు. అలాగే రోడ్డు ప్రమాదంలో మరణించిన కొంగ లక్ష్మయ్యకు బీఆర్ఎస్ సభ్యత్వం ఉండటంతో రూ.2లక్షల పార్టీ బీమా చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా భగత్కుమార్ మాట్లాడుతూ కార్యకర్తలకు ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తానని అన్నారు. వైస్ ఎంపీపీ వజ్జ రామేశ్వరీధనంజయ్, ఎంపీటీసీ చంద్రమౌళి, సర్పంచులు జకల భాసర్, చాడ చక్రవర్తి, బద్రి యాదయ్య, దీపరాములు, షేక్ సిరాజ్, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి సింగం ప్రవీణ్, నాయకులు కునూరి సైదిరెడ్డి, అమరేందర్రెడ్డి, షేక్ ఇస్మాయిల్, ఇటికాల శివ, నగేష్, వనమాల మహేందర్, రాములు పాల్గొన్నారు.