మిర్యాలగూడ, జనవరి 18: ఈ నెల 22న హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగే నల్లగొండ లోక్సభ నియోజకవర్గస్థాయి సమావేశానికి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు హాజరు కావాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కోరారు. గురువారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సమావేశంలో నల్లగొండ ఎంపీ ఎన్నికలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకులకు దిశా నిర్దేశం చేయనున్నట్లు వివరించారు. సమావేశానికి మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి వంద మంది తరలి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఆగ్రోస్ మాజీ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, జిల్లా రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
మిర్యాలగూడ : పేద ప్రజల అభ్యున్నతికి దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ.రామారావు ఎంతో కృషి చేశారని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. గురువారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా భాస్కర్రావు మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేశారని కొనియాడారు. అనంతరం ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెర్రిపోతుల రాములుగౌడ్, పునాటి లక్ష్మీనారాయణ, అరుణ్కుమార్, కూనల గోపాలకృష్ణ, పరిమి రామావతారం, అన్నపర్తి గంగాధర్, సాధినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.