మిర్యాలగూడ, ఫిబ్రవరి 4 : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే గెలుపని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మిర్యాలగూడలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ కమిటీ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారాన్ని కోల్పోయినప్పటికీ పార్టీ బలంగా ఉందని, కార్యకర్తలు అధైర్యపడవద్దని సూచించారు.
నేడు పట్టణంలోని టీఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించే నియోజకవర్గస్థాయి పార్టీ ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు గుంటకండ్ల జగదీష్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి పాల్గొననున్నారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆగ్రోస్ మాజీ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు అన్నభీమోజు నాగార్జునాచారి, పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ నియోజకవర్గ యువ నాయకుడు నల్లమోతు సిద్ధార్థ్ధ, నాయకులు మగ్ధుంపాషా, బాసాని గిరి, బంటు శ్రీనివాస్, మదార్బాబా, ఖాజామొయినొద్దీన్, ఎండీ షోయబ్ పాల్గొన్నారు.