నల్లగొండ రూరల్, ఏప్రిల్ 13 : నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే బీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని వీటి కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం పట్టణంలోని 1,2,3,4,5,18,19,20 వార్డుల బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు.
రైతాంగానికి పెద్దపీట వేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, అందుకే ప్రభుత్వంపట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలను బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు కటికం సత్తయ్యగౌడ్, చీర పంకజ్ యాదవ్, మందడి సైదిరెడ్డి, అభిమాన్యు శ్రీనివాస్, ఆలకుంట్ల నాగరత్నం రాజు, బకరం వెంకన్న, బోనగిరి దేవేందర్, దేప వెంకట్రెడ్డి, జనార్దన్రావు, హరికృష్ణ, పేర్ల అశోక్, హరికృష్ణ, యాదగిరి, ప్రదీప్, సంపత్, పూలేందర్, కృష్ణయ్య, నాగార్జున పాల్గొన్నారు.